ఓం హర హర మహాదేవ శంభో శంకరా
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాషిత శోభిత లింగం
జన్మజ దుఖ వినాశకలింగం
తత్ప్రనమామి సదాశివ లింగం !
దేవ ముని ప్రవరార్చిత లింగం
కామ దహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం!
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ వాసిని శోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం !
దేవగణార్చిత సేవిత లింగం
బావై భక్తి భిరేవచ లింగం
దినకరకోటి ప్రభాకర లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం !
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ది వివర్ధన కారణ లింగం
సిద్ధి సురాసుర వందిత లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం !
అష్టదలోపరి వేష్టిత లింగం
సర్వ సముద్భవ కారణ లింగం
అష్ట దరిద్ర వినాశక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం !
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమ పరం పరమాత్మక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం !
అజ్ఞాష్టకం మిదం పుణ్యం పాప వినాశకం .
ఒక ఊరిలో ఒక కిరాతకుడు ఉండేవాడు . ఇతడు తన భార్య పిల్లలను పోషించడానికి ప్రతి రోజు అడవికి వెళ్లి జంతువులను వేటాడి చంపి తినే వాడు కుటుంబాన్ని పోషించేవాడు . ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే ఇతని అమ్మ తన కుమారున్ని పిలిచి నాయనా నీవు అడవికి వేటకు వెళ్ళుఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు అని చెప్పి సొరకాయ బుంగిలో నీళ్ళు పోసి దానికి ఒక దారాన్ని కట్టి దీన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పినది . కిరాతకుడు అలాగే అమ్మా అని సొరకాయ బుంగిని తీసుకొని అడవికి వెళ్ళాడు . ఇతనికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక జంతువుకూడా కనిపించలేదు . ఇతను ఉదయం నుంచి పచ్చి నీళ్ళు కూడా త్రాగలేదు . విశేషం ఏమి టంటే ఆ రోజు మహాశివరాత్రి ఇతనికి తెలియకుండా నే ఇతను ఉపవాసం ఉన్నాడు . ఇతను ఈ రోజు రాత్రంతా ఎలాగైనా సరే వన్య మృగాలను వేటాడి తీసుకొన వెళ్ళాలని ఒక మారేడు చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడు . వన్య మృగాలు కోసం వేచి చూస్తున్నాడు . ఇతని సౌభాగ్యం ఏమిటంటే అతడు ఎక్కి కూర్చున్న మారేడు చెట్టు క్రింద శివ లింగం ఉంది . ఇతనికి ఒక లేడి జింక కనిపించింది . ఆలేడి పైన గురి పెట్టి చూస్తూ బాణం వేసాడు అధిగురి తప్పినది . ఇతను బాణం వేసినప్పుడు ఇతని చెయ్యి తగిలి తన దగ్గరున్న సొరకాయ బుంగి లో ఉన్న నీళ్ళు శివ లింగం పైన పడింది. తర్వాత బాణం విసిరాడు మరల గురి తప్పినది ఇతని చెయ్యి తగిలి మారేడు ఆకులు శివలింగం పైన పడింది . ఇలా ఇతనికి తెలియకుండానే బగవంతుని కృపకు పాత్రుడయ్యాడు . ఈ కిరాతకుని చెయ్యి తగిలి నీళ్ళు మారేడు ఆకులు శివలింగం పైన పడింది పుణ్యం అంటే ఇదే నేమో రాత్రి నాలుగు జాములు అయిపోయింది . ఒకవిధంగా ఇతనికి తెలియకుండానే ఉపవాసం జాగారణ ముగిసింది . ఈ కిరాతకునికి బ్రహ్మ జ్ఞానం కల్గింది పరమశివుడు ప్రత్యక్ష మయ్యి ఏమి వరం కావాలనో కోరుకో అనెను . పరమశివుణ్ణి చూసిఇతడు సంతోషంతో ఎంత భాగ్యం తండ్రి అని నాతప్పులన్ని చమించు తండ్రీ అని పరమ శివుని పాదాలపైన పడ్డాడు . నీ పాపాలన్నీ తొలగి మరుజన్మలో నీవు గుహుడు అనే చక్రవర్తిగా జన్మిస్తావు అంతే గాక శ్రీరామ చంద్రుడు సేవకు పాత్రుడు అవ్వుతావు అని దీవించాడు .కిరతకుడుగా ఉన్న ఇతడు పరమ శివుని భక్తుడిగా కీర్తి చెందినాడు . దీనితో మనకు తెలిసింది ఏమిటంటే మహా శివరాత్రి రోజు ఉపవాసం జాగారణ వల్ల మనకు పుణ్యం లభిస్తుంది .


No comments:
Post a Comment