Thursday, 25 February 2016

దర్శకేంధ్రుడు కె రాఘవేంద్రుని క్లాస్ రూమ్ లో ఏ ముంటాయో

దర్శకేంధ్రుడు కె రాఘవేంద్రుని క్లాస్ రూమ్ లో ఏ ముంటాయో :

తెలుగు దిగ్గజ దర్శకుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన దర్శకుడు కె రాఘవేంద్రరావుగారు అని చెప్పవచ్చు . ప్రస్తుతం భక్తి చిత్రాలు తీస్తున్నారు గానీ .... ఓ దశాబ్దం ముందు వరకూ రక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయనే అని చెప్పవచ్చు . బ్లాక్ బస్టర్ చిత్రాలకు మారుపేరు ఈయనే అని చెప్పవచ్చు . స్టార్ హీరోలకు సెంటిమెంట్ ఆయన మారుపేర్లు . అంతే కాదు హీరోయిన్లురాఘవేంద్రరావుగారు సినిమాలో నటించడానికి అందరూ ఇష్టపడేవారు . రాఘవేంద్రరావుగారు అంటేనే జనం అంతా ఇష్టపడతారు . ఇక ఆయన సినిమాలో నటించడం అంటే  ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి .రాఘవేంద్రరావుగారు సినిమాలో నటించడం తమ అందం  పది రెట్లు పెరుగుతుందని కొత్త హీరోయిన్లు పాత హీరోయిన్లు అందరూ నమ్మేవారు .
రాఘవేంద్రరావుగారు  శిష్యరికం అంటే మాములు విషయం కాదు . రాఘవేంద్రరావుగారు సినిమాలు తీయడంలో మెలుకువలు నేర్పిస్తే ఎంత గమ్మత్తుగా ఉంటుందో .దర్శకుడు రాజమౌళి గారు కూడా ఆయన  దగ్గర నుంచి వచ్చిన శిష్యుడు . ఇప్పుడు తనే కె ఆర్ ఆర్ క్లాస్ రూమ్ అంటూ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు . సినిమా తయారీ లో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వడం ఈయన ఉద్దేశం . దీనికి సంబంధించి ఓ చిన్న యాడ్ తన మీదే రూపొందించి తనే నటించి నెట్ లో పెట్టారు .  రాఘవేంద్రరావుగారు చివర్లో వాచ్ పర్ డీటైల్స్ అంటూ టీచర్ రేంజ్ లో ఊరించారాయన . క్లాసు రూమ్ గురుంచి మరిన్ని విషయాలు ఆయనే చెప్పాలి . మరీ అంతటి దిగ్గజ దర్శకేంధ్రుడు దగ్గర నుంచి ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ పొందేందుకు ఎంతో మంది ఉత్సాహ పడుతున్నారు . చాల మంది శిక్షణ పొందడానికి రెడీ అయి పోతున్నారు .


Monday, 22 February 2016

నితిన్ నిత్యామీనన్ మళ్లీ గుండె జారుతుందా

నితిన్  నిత్యామీనన్  మళ్లీ గుండె జారుతుందా :
నితిన్  నిత్యామీనన్ కలసి ఒక సినిమా చేయ బోతున్నారు . వరుసగా డజన్  సినిమాలు ప్లాప్ అయినప్పుడు సోలిపోకుండా కుర్ర కారుకు నచ్చిన విధంగా హై లైట్ గా సినిమా చేయబోతున్నారు . నితిన్ ఇష్క్ సినిమాతో తర్వాత గుండె జారి గల్లంతయ్యిం దే సినిమాతో బ్లాక్ బస్టర్ సాదించాడు . ఈ రెండు సినిమాల్లోనూ నితిన్ నిత్యామీనన్ కలసి లవ్ రొమాన్స్ కుర్రకారును విపరీతంగా అట్ర్ క్ట్ అయ్యారు . ఆ తర్వాత వరుసగా హిట్స్ కొడుతున్న నితిన్ మరోసారి నిత్యమీనాన్ తో కలసి మరో చిత్రం చేయబోతున్నాడు అని తెలుస్తున్నది . మూడో సారి నిత్యామీనన్ తో జత కడుతున్నాడు . ఈ సినిమాకు కూడా గుండె జారి గల్లంతయిం దే డైరెక్టర్ కావడం విశేషం . త్రివిక్రం శ్రీనివాసు గారు దర్శకత్వం వహిస్తున్నారు . ఈ ముగ్గురు కలసి బ్లాక్ బస్టర్ సాధించ బోతున్నారు అనిపిస్తున్నది . 

Sunday, 21 February 2016

మహేష్ బాబు క్రొత్త సినిమా


మహేష్ బాబు క్రొత్త సినిమా విడుదల కాబోతుంది ఆ సినిమా పేరు ఏమిటంటే అది బ్రహ్మాత్సవం .  ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంతో శర వేగంతో షూటింగ్ జరుపుకొంటుంది . అయితే  ఈ సినిమాకు కూడా శ్రీమంతుడు తరహాలోనే సహ నిర్మాతగా ఉండాలని మహేష్ బాబు గారు  భావించారు . ప్రముఖ నిర్మాత పి వి పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . అయితే మహేష్ బాబు భాగస్వామ్యం ఇష్టం  లేని నిర్మాత పి వి పి మహేష్ బాబుతో చర్చలు జరిపారట  .సినిమాను పూర్తి స్థాయిలోను తానే నిర్మిస్తానని చెప్పారట . ఈ మేరకు మహేష్ బాబుకు 25కోట్ల రెమ్యూన రేషన్ ఆపర్ చేసాడని దీనితో పాటు లాభాల్లో కొంత వాటా ఇస్తానని డీల్ సెట్ చేసారట . ఈ సినిమా విడుదలకు ముందే బ్రహ్మోత్సవం బిజినెస్ ఓ రేంజ్ లో సాగుతుంది . ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీగా 13కోట్లకు పైగా అమ్ముడుపోయాయి . సాటిలైట్ రైట్స్ కూడా 12కోట్లకు పైగానే పలుకుతుందని సమాచారం . శాటిలైట్ ఓవర్సీస్ రూపంలోనే సినిమాకు 25కోట్ల బిజినెస్ అయ్యింది . థియే ట్రికల్ రైట్స్ ఇతర రైట్స్ రూపంలో మరో 90కోట్ల బిజినెస్ జరగడం ఖాయం అంటున్నారు . మహేష్ బాబు సినిమా అంటేనే జనం చాలా ఇష్టపడతారు . ఈ సినిమా పేరే బ్రహ్మోత్సవం ఇక ఎంతో బ్రహ్మాండంగా ఉండవచ్చు కదా .


పైన ఉన్న ఫోటోలో మహేష్ బాబు  సమంత ప్రణీత కలసి పూజ చేస్తున్నారు . బ్రహ్మోత్సవం సినిమా లో మహేష్ బాబు ప్రక్కన సమంత చుడిదార్ వేసుకొని కూర్చుని ఉంది మరోప్రక్క ప్రణీత లంగా ఓని వేసుకొని కూర్చొని పూజ చేస్తున్నారు . బ్రహ్మోత్సవం సినిమా మే నెలలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి  . ఈ సినిమా సంస్కృతి సంప్రదాయాలను నిలువ ఉంచే చిత్రంగా కనిపిస్తున్నది . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం హైలైట్ అనిపిస్తున్నది . 

Thursday, 18 February 2016

జై గణేశ

జై గణేశ :ఓం గం గణపతియే నమః :

ఓం శుక్లాం భరధరం విష్ణుం
శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న
వదనం ధ్యాయే త్సర్వ విగ్నో పశాంతయే
అగ జానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ముపాశ్మహే !
ప్రతి మనిషికి కష్టాలు ఉండనే ఉంటుంది . ఆ కష్టాలు తొలగాలంటే భగవంతున్ని పూజిస్తాము కదాఅన్నీ దేవుళ్లలో  మొట్ట మొదట వినాయకున్ని పూజించాలి . ఆయన ఆశీర్వాదం ఉంటే అన్నీ విగ్నాలు తొలగిపోతాయి . పిల్లలకు విద్యాబుద్ధులు రావాలంటే గణపతినే పూజించాలి . మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు గణపతిని  పూజించి వెళ్ళితే ఆపనిలో విజయం కల్గుతుంది .


వక్ర తుండ మహాకాయా
సూర్యకోటి సమప్రభా
నిర్విగ్నం కురుమే దేవా
సర్వ కార్యేశు సర్వదా !
శరణం గణేశ శరణం గణేశా
శరణం గణేశ శరణం గణేశా !
పార్వతి పుత్రా శరణం గణేశా
పాప సంహార శరణం గణేశా
గజముఖవాహన శరణం గణేశా
కరుణతో మమ్ము కావుముస్వామి
శరణం గణేశ శరణం గణేశా
శరణం గణేశ శరణం గణేశా !

చిన్ని చెంబుతో నీ ళ్ళు శీకాయ ఉదకంబు అల్లంబు బెల్లంబు అరటిపండ్లు
తేనతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు భుద్ధిచ్చు గణపతికి నిపుడు
జయమంగళం నిత్య శుభ మంగళం !

Tuesday, 16 February 2016

నిద్ర లేచేటప్పుడు శ్లోకం :
కరగ్రేవ సతే లక్ష్మీ హః
కరమర్దే  సరస్వతీ
కరమూ లేతు గోవిందా
ప్రభాతే కరదర్శన !



భోజనం చేసే ముందు శ్లోకం :
అగస్త్యం  కుంబ కర్ణంచ్య
బడ బాణ నం
ఆహార  పరిణ మార్ధం
స్మరామిచా  వృకోదరం !



పడుకొనే ముందు శ్లోకం :
రామస్కందం  హనుమంతం
వైనతే  వృకోదరం
శయనేయం  సస్మరే నిత్యం
దుశ్స్  స్వప్నం తశ్య నశ్యతే !

Monday, 15 February 2016

తులసివందనం

తులసివందనం 
పాతక హారిణి శుభ వందనం 
అభివందనం !
ప్రతి ఒక్కరూ నివసించడానికి ఒక ఇల్లు కావాలి కదా ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలని అనుకొంటారు . అందుకే ఇంటి ముందు తులసి మొక్కను ఉంచి పూజ చేస్తారు . తులసి అతి పవిత్రమయినది . తులసీ అంటే లక్ష్మీనారాయణనుకి చాలా ఇష్టం. తులసీ పూజ చేయడం వలన సర్వ పాపాలు కష్టాలు తొలగిపోతాయి . అంతే కాదండోయ్ మన ఇంటికి అందం కూడా . ప్రతి ఇల్లాలు తులసీ పూజ చేయాలి . తులసీ పూజ చేయడం వలన ఇంట్లో బర్త పిల్లలు అందరు ఆరోగ్యంగా ఉంటారు . ప్రతి ఇల్లాలు తను ధీర్ఘ సుమంగళిగా ఉండాలని అనుకొంటుంది . అందుకే తులసీ పూజ చేయాలి . తులసీ పూజ చేయడంవలన తులసీ మాత కృపకు పాత్రురాలవుతారు . మంచి భర్త రావాలని కన్యపిల్లలు తులసీ పూజ చేయవచ్చు . తులసీ పూజ చేయడంవలన మంచి భర్త వస్తాడు .తులసిమాత  మన కష్టాలను ఇంటిలోపలకి చేర నివ్వకుండా బయటకు తరిమి కొడుతుంది . అంతే కాదు చిన్న పిల్లలకు జలుబు దగ్గు వచ్చిందంటే కొంత తులసీ ఆకులను తిని పించి నట్టయితే జలుబుధగ్గు తగ్గిపోతుంది . ప్రతి ఒక్కరికీ కూడా కోల్డ్ అయినప్పుడు కొన్ని తులసీ ఆకులను తిన్నట్టయితే కోల్డ్ తగ్గిపోతుంది . ఇంకా ఆస్మా ఉన్నవారుకూడా తులసిఆకులను పరగడుపున తిన్నట్టయితే కొంత ఉపశమనం కల్గుతుంది .


తులసీ శ్లోకం :
ఎన్మూ లే సర్వ తీర్థాని
ఎన్మర్దే సర్వ దేవతాహ
యధాగ్రే సర్వ వేధార్చ
తులసీం త్వం నమామ్యహం !
ప్రతి ఇంటా తులసీ మొక్కను నాటి తులసీ పూజచేయాలి . ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి తులసీ ముందు ముగ్గులు పెట్టి
తర్వాత దీపం వెలిగించి పూజచేయాలి . ప్రతి రోజు సాయంత్రం (సంద్యసమయంలో )కూడా దీపం వెలిగించి పూజచేయాలి . ఈ విధంగా చేయడం వలన మనకున్న అరిష్టాలన్నీ తొలగిపోతాయి . తులసీ శ్లోకాన్ని పటిస్తూ పూజచేసి మనస్సులో తులసీ మాతను ధ్యానం చేయాలి . మీరు కూడా చేస్తారు కదూ.
తులసీ అంటే శ్రీకృష్ణ రుక్మిణికి కూడా చాలా ఇష్టం . మనం ఎన్ని రకాల పువ్వులతో పూజచేసినా (సమర్పించినా )ఆయన తులసీ  కోసం వెతుకు తాడట . ప్రతి రోజు తులసీ మాలను శ్రీకృష్ణునికి సమర్పించి నచో మనం కోరిన కోర్కెలను తీరుస్తాడు . తులసీ పూజ చేయడం వలన మన కష్టాలు దారిద్ర్యం తొలగిపోతాయి . అందరు తులసీ పూజ చేయండి ఆనందంగా ఆరోగ్యంగా సిరిసంపదలతో తులతూగుతూ ఉండండి . తులసీ దగ్గర కూర్చుని పూజచేయడంవలన తులసీ సువాసన పీల్చడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాము . మన శత్రువులు మనకు చెడు చెయ్యాలని అనుకొని మంత్రగాళ్ళ ద్వారా చెడుపు చెయ్యాలని చేస్తారు . మన ఇంటిముందు తులసీ ఉన్నట్టయితే ఆ చెడుపు మనకు తగలకుండా తులసీ కాపాడుతుంది . తులసీ పూజ చేయడంవలన మనకు అన్నీ కష్టాలు తొలగిపోతాయి . అందుకే ప్రతీ స్త్రీ కూడా తులసీ పూజ చేయాలి . మీరు పూజచేస్తారు కదా !

Saturday, 13 February 2016

శ్లోకాలను అందరూ చదవండి


మనకు బాగా చదువు  రావాలంటే ఈ శ్లోకాన్ని మనం మన మనస్సులో బగవంతున్ని స్మరించుకొని జపించాలి . అప్పుడు బాగా చదువు వస్తుంది . పిల్లలకు ఎవరికైనా చదువు రాకుంటే ఈ క్రింది శ్లోకాన్ని చదవమని (పటించమని )చెప్పండి .
చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు
కొలువుతో తీరుతుంది నీకు కరువు
కరువు తీరి వస్తుంది నీ జీవితానికి వెలుగు
ఆ వెలుగును పది మందికి పంచి పెంచుకో నీ పరువు !
చదువు గురుంచి శ్లోకం :
జ్ఞానానందమయం  దేవం
నిర్మల  స్పటికా కృతిం 
ఆధారం  సర్వ  విద్యా నాం 
హయగ్రీవ  ముపాస్మహే !

అప్పు తీర్చే శ్లోకం :
అంగారక మాహి పుత్రా
భగవాన్ భక్తవత్సలా
నమోస్తుతే మమా శేషా
రుణ మాశు విమోచయా !

మనకు త్వరగా అప్పులు తీరాలంటే ఈ శ్లోకాన్ని పటిస్తే అప్పులు తీరిపోతాయి . సహజంగా మన బ్రతుకు తెరువు కోసం అప్పులు చెయ్యక తప్పదు . అప్పులు చేస్తేగానీ బ్రతుకు జరగదు . అప్పులు చేసి బిజినెస్ చేస్తారు . బిజినెస్ లో లాభాలు వచ్చి అప్పులు తీర్చి హాయిగా బ్రతకాలంటే అప్పుతిర్చే శ్లోకం ను పటించండి .

డబ్బు చేరే శ్లోకం :
సిద్ధి బుద్ధి ప్రధాదేవీ
భుక్తి ముక్తి ప్రదాయినీ
మంత్ర మూర్తి సదాదేవీ
మహాలక్ష్మీ  నమోస్తుతే !

ప్రతి మనిషికి డబ్బు చాలా అవసరం డబ్బు లేక పోతే ఒక రోజుగడవడం కష్టమయిపోయింది . డబ్బే లోకమయిపోయింది. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏమి జరగదు . కొంత మంది ఎక్కువగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు . కానీ ఆడబ్బులు నిలవ   లేక పోతుంది . మన ఇంట్లో డబ్బులు నిలవాలంటే ఈ శ్లోకాన్ని పటించండి . మహాలక్ష్మి కరుణిస్తే చాలు మనకష్టాలు తొలగిపోతాయి .


Friday, 12 February 2016

ఆదిపరాశక్తి నమోస్తుతే

ఆదిపరాశక్తి నమోస్తుతే :

నాబంగారుతల్లికి నా నమస్సుమావాలి తో నాఆదిపరాశక్తి ని పూజిస్తున్నాను .
శ్రీ మన్ మనో మాని నీ చిత్త సంకాశినీ
చిత్ కళా రూపిణీ  చిన్మయ స్వరూపిణీ
భక్త మందాకినీ  శాకినీ డాకినీ
చేదినీ వేదినీ ప్రేమతో పాయని
నిరసాది బచ్చనీ యచ్చనీ రచ్చ నీ
పాతాళ లోకేశ్వరి రాజరాజేశ్వరీ
చంద్ర మౌలీశ్వరీ నే నిన్ను గొల్చెదన్
కరుణించ వే కాపాడవే కాళీ కరుమారి !


ఓంకార ప్రణవ జగజ్జననీ సర్వప్రాణి కోట్లకు నెల్లా ఆదిశక్తివి నువ్వేనమ్మా
సకల చరాచరములను సృష్టించిన పరబ్రహ్మవు నీవే నమ్మా
ఈ సృష్టిని పోషించిన పరమ విష్ణువు నీవే నమ్మా
సృష్టిని నిలయింప చేసిన పరమ రుద్రుడు నీవే నమ్మా
సదా మమ్ము బ్రోవవే ఆదిపరాత్పరి దేవీ నారాయణి నమోస్తుతే !
ఓంకారం అనే శబ్దంలో అమ్మ ఆదిపరాశక్తి జన్మించింది . అమ్మలగన్న అమ్మ సర్వప్రా ణి కోట్లకు మూలం ఆధారం .
కొండలు వాగులూ నదులు సముద్రాలు అడవులు జలశాయములు చెట్లు పక్షులు అన్నింటినీసృష్టించినతల్లి ఆదిపరాశక్తియే . జగన్మాత మన తలరాతలను వ్రాసిన పరబ్రహ్మ ను సృష్టించింది . ఇంకా ఈ లోకాన్ని పోషించే పరమ విష్ణువును సృష్టించింది . ఈ ప్రపంచాన్ని ఏలే శివుణ్ణి కూడా అమ్మే సృష్టించింది . ఈ లోకంలో ప్రతి జీవిని అమ్మే సృష్టించింది . అలాంటి అమ్మకు పాదాభి వందనం తెలుపుతున్నాను . మన చుట్టూ మనకు శత్రువులు ఉంటారు కదా ఎప్పుడూ మనల్ని పడగొట్టాలని చూస్తుంటారు . మనం ఆదిపరాశక్తి ని పూజిస్తున్నట్టయితే మన శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు . మనచుట్టూ మనశత్రువులే గాకుండా ప్రేతాత్మలు కూడా తిరుగుతుంటాయి .
మనం పైన ఉన్న స్తోత్రాన్ని పటిస్తూ ఉన్నట్టయితే పూజచేస్తూ ఉన్నట్టయితే శత్రువులభయం ప్రేతాత్మల భయం పటా పంచలయిపోతాయి . కొంత మంది పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు . వాళ్ళకు భయం పోవాలంటే ఈ స్తోత్రాన్ని చదివి పించండి భయం పోతుంది .

Thursday, 11 February 2016

బక్కటైలర్ కథ రెండవ భాగం

బక్కటైలర్  కథ  రెండవ భాగం :

జగన్మాతా ముగ్గురమ్మల మూలకుటమ్మ

జగన్మాతా ముగ్గురమ్మల మూలకుటమ్మ :
రక్షమాం పాహిమాం :
ఆదిపరాశక్తి జగన్మాతకు శతకోటి ధన్యవాదాలు నాకు జగదాంబ అంటే చాలాచాలా ఇష్టం . ఇష్టం మాత్రమే కాదండి నాప్రాణం కూడా అనువనువున జగన్మాతనే . నేను ఏ పని చెయ్యలన్నాకూడా నామనసులో జగన్మాతను స్మరించుకొని నీ కు ఇష్టమేనా  జననీ అని అడిగి చేసేదాన్ని . నాకు ఊహ తెలిసిన నాటినుంచి జగన్మాతను పూజిస్తున్నాను . ఎలా అంటే నేను 3వ తరగతి చదువుతున్నాను అప్పుడు నేను టీవిలో సినిమా చూస్తున్నాను కరెంటు పోయింది . అప్పుడు నేను ఎవ్వరూ లేని చోట వచ్చి కన్నులు రెండూ మూసుకొని అమ్మను ప్రార్థించే దాన్ని కరెంటు వచ్చేసేది . జగన్మాత అంటే పిచ్చి ప్రేమ ఇష్టం ఇంకా ఏమి చెప్పాలో తెలియడం లేదు . ఇంకా కాలేజీ రోజుల్లోకూడా సినిమాపాటల్లో కూడా అమ్మను అన్వయించుకొని పాడేదాన్ని . ఎప్పుడు నామనసు ఆదిపరాశక్తి అయిన అమ్మలుగన్న అమ్మ పైనే ఉండేది . నా వయస్సు 35సంవత్సరాలు యిప్పటికిని నాకు జగన్మాతా అంటేనే ఇష్టం . నా కేదైనా కష్టం వస్తే జగన్మాతా ఫోటో ను చూస్తే చాలు నామనసు కుదుటపడేది . నా అమ్మను చూస్తే చాలు కష్టాలన్నీ మరచిపోయి నాకే తెలియని ఉల్లాసం సంతృప్తి కల్గేది . అందరు అమ్మాయిలు ప్రేమలు గురించి చెప్పుతూ ఉండేవారు . కానీ నాకు మాత్రం అమ్మను మించిన ప్రేమ లేదని పించినది . జగన్మాతా కరుణ శీలి . ఆమెను పూజించడం నాజన్మ ధన్యం . అన్నీ దేవుల్ని పూజించిన కానీ ఫస్ట్ నాకు జగన్మాత అంటేనే ఇష్టం ఆ జగన్మాతను జన్మ జన్మలకు పూజిస్తూ ఉంటాను ప్రార్థిస్తూ ఉంటాను . మీరు అమ్మను నమ్ముతారా !


కర్పూర నాయగియే కనకవల్లీ వీడియో 
కర్పూర నాయగియే కనకవల్లీ
 కాళీ మగమాయి  కరుమారియమ్మా !
పొర్ కోవిళ్ కొండ శివగామియమ్మా
భూమి యింద వల్లి ధైవయానయమ్మ
కర్పూర నాయగియే కనకవల్లీ
 కాళీ మగమాయి  కరుమారియమ్మా !
నెత్తి ఇలే కుంకుమమే  యిరుక్కవేండుం అమ్మా
నెంజిల్ ఉన్ తిరునామం నిలయవేండుం
కట్ర దెల్లామ్ మేల్మేలుం పెరుగ వేండుం
పాడుం కవిదయిలే ఉన్ నామం వలియ వేండుంఅమ్మా !
కర్పూర నాయగియే కనకవల్లీ
 కాళీ మగమాయి  కరుమారియమ్మా !
కాట్రాగి కడలాగి కడలాగి నాయి
నేట్రాగి యిండ్రాగి నాలాగినాయి
కనవాగి నేనవాగి కన వాగినాయి
కర్పూర నాయగియే కనకవల్లీ
 కాళీ మగమాయి  కరుమారియమ్మా !



Monday, 8 February 2016

బక్క టైలర్ కథ

బక్క టైలర్ కథ :
అనగనగా ఒక రాజు ఉండేవాడు .  రాజ్యంలోని ప్రజలనురాజు  చాలాబాగా చూసుకొనేవాడు . ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పించేవాడు . ప్రజలను తనబిడ్డలవలె  చూసుకొనేవాడు . ఆరాజ్యంలోని ప్రజలు కూడా రాజును భగవంతుడు వలె పూజించేవారు . ఆ రాజుకు ఒక్క గాన ఒక్క కూతురు ఉండెను . ఆ కూతురును చాలాబాగా గారాబంగా పెంచేవాడు . కానీ రాజ్యంలో ఒక చోట ఒకపెద్ద మర్రిచెట్టు  ఉండేది . ఆ మర్రిచెట్టులో ఒక పెద్ద దయ్యం (రాక్షసుడు )ఉండేది . ఆ రాక్షసుడు ఆ చెట్టు దగ్గరకి వచ్చినవారిని  అందరని బయపెట్టి చంపి తినేస్తూ ఉండేది. ప్రజలందరు బయబ్రాంతులయ్యేవారు .  ఆ చెట్టు దగ్గరకి వెళ్ల వలనంటే బయపడేవారు . ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఉండేది . ఆ గ్రామంలోఒక బక్క టైలర్ ఉండేవాడు . ఆయన  బట్టలు కుట్టుతూ ఉండేవాడు . ఇలా ఉండగా ఒకరోజు ఇతనికి చాలా ఆకలి వేసింది బోజనంకు బదులు ఒకరెండు జాంగ్రీ లను తీసుకొచ్చాడు . ఆ జాంగ్రీ లనుపక్కన పెట్టి తర్వాత తింటాము అనుకొని బట్టలు కుట్టుతూ ఉన్నాడు . ఆ జాంగ్రీ ల పైన ఈగలు వచ్చి వాలాయి . ఆ బక్క టైలర్ దానిని చూశాడు . ఒక్క సారిగా తన చేతులతో ఆ ఈగలను కొట్టాడు . ఒక్క సారి కొట్టగానే ఏడు ఈగలు చనిపోయింది . తనకుతానే ఆశ్చర్యపడ్డాడు అరే మనం ఒక్కసారిగానే ఏడు జీవులను చంపేసాము అని గర్వపడ్డాడు . ఇది ఇలా ఉండగా రాజ్యంలో రాజు ఒక ప్రకటన చేసాడు . ఎవ్వరయితే  తనరాజ్యంలో ఉన్న రాక్షసుణ్ణి చంపుతారో వారికి తన గారాల కూతురుని అతనికి ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు . ఈ ప్రకటనను విన్న జనం అంతా ఆ రాక్షసుణ్ణి చంపి రాకుమారిని వివాహం చేసుకోవచ్చని ఆ రాక్షసుడుని చంపడానికి ఆ చెట్టు దగ్గరకి వెళ్ళేవారు . కానీఆ రాక్షసుడు వచ్చినవారినంధరిని చంపేసేవాడు . ప్రజలందరు బయపడుతూ ఉండేవారు . ఇది ఇలా ఉండగా బక్కటైలర్ ఏడు జీవులను చంపానని ఒక పేపర్ లో రాసుకొని తన మేడలోవేసుకొని అందరికి చూపిస్తూ ఉండే వాడు  . దీ నిని చూసిన రాజుగారి భ టు లు ఆ బక్క టైలర్ ను తీసుకొని రాజుగారికి అప్పగించారు .
ఆ రాజు అతణ్ణి చూసి ఇతన్ని చూస్తే ఇంత బక్క చిక్కిఉన్నాడు  ఇతను రాక్షసుడుని చంపగలడా అని నిరాశ కల్గింది . \కానీ ఈ బక్కటైలర్ నేను చంపగలను అని వాదించాడు . తర్వాత ఆ చెట్టుధగ్గరకి వెళ్ళాడు .

బక్కటైలర్  రెండవ   భాగం :

కవితలు

కవితలు :
భూమికి చెట్లు అందం
ప్రకృతికి పువ్వులు అందం
మన తరగతికి విద్యార్థులే అందం !

రంజాన్ పండుగకు చిక్కన్ ఉండాలి
క్రిస్మస్ పండుగకు కోక్ ఉండాలి
దీపావళి పండుగకు టపాకాయ లుం డాలి
సంక్రాంతి పండుగకు చెఱకుండాలి !

రస వంతమైన పద్యాలు

రస వంతమైన పద్యాలు :

తల్లి తండ్రి మీదదయలేని పుత్రుండు
పుట్టనేమివాడు గిట్టనేమి
పుట్టలోన  చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమా !

అడిగెద ననికడు వడిజను
అడిగినతన మగడు నుడువడని నడయుడగున్
వెడవెడ జిడిముడి తడబడ నడుగిడు
నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ !

అటజని కాంచ భూమి చురుడుంబని చుంబి
శిరస్సర జ్జరి పటల ముహుర్ము హుర్లుట
తబంగ తరంగ నటనిస్పుట నటనాను కూల పరిపుల్ల
కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు  తెంపు మెయి శాలము సీత శైలమున్ !

చదువది ఎంతకల్గిన రసజ్ఞత ఇంచుక నాచదువు
నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు  మెచ్చ రెచ్చటం
బదునుగ నలపాకము చేసినైన నింపొదవెడు
నుప్పు లేక రుచి నేర్చునటయ్య భాస్కరా !

దీపంజ్యోతి పరబ్ర హ్మం
దీపం సర్వ తమోప హం
దీవేనా సాధ్యతే దీపం
సర్వం సంధ్యా దీపం నమోస్తుతే !

ఈ పద్యములన్నిం టినీ చదవండి పద్యములోని నీతిని గమనించండి పాటించండి .
మంచి పద్యములు అంటే అందరికీ ఇష్టమే కదా . తల్లీ తండ్రుల మీద కొంచెం కూడా దయ లేకుండా ప్రవర్తించే కొడుకు పుట్టితే ఏమి లేకున్నా ఏమి అనుకొంటాము కదా అలాగే పుట్టలో చెదలు పుడుతుంది చస్తుంది అని కవులలో గొప్ప కవి వేమన మంచి పద్యాలను రాశారు . 

Tuesday, 2 February 2016

లింగుస్వామితో బన్ని ఫిక్స్ అయ్యాడోచ్

మన తెలుగు స్టార్ బన్ని (అల్లుఅర్జున్ ):లింగుస్వామి దర్శకత్వంతో ఒక క్రొత్త  మూవీ బన్ని చేయబోతున్నాడు . లింగుస్వామి ఒక పె ద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ . లింగుస్వామి దర్శకత్వం అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం . లింగుస్వామి  దర్శకత్వంతో మనబన్ని ఓకె చెప్పాడు . ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ మూవీ అని మనలింగుస్వామి చెప్పారు . మనబన్నిసై అనిచేప్పేసరికి లింగుస్వామి సంతోషపడ్డాడు .తమిళంలో సూర్యతో అన్జాన్ ( తెలుగులో సికంధర్ ) ఈ మధ్యలో వచ్చిన రజిని మురుగన్ చిత్రాలు సూపర్ డూ పర్ అవ్వడంతో అదే  సూపర్ హిట్ కావాలని జోష్ గాకొనసాగించాలని లింగుస్వామి  చిత్రాన్ని మనబన్నితో చేయించాలని అనుకొన్నాడు . హీరోహిన్ ఎవరో తొందరలో చెబుతాను అంటున్నారు .లింగుస్వామి ఇక డైరెక్టర్ గా మాత్రమే ఉండాలని నిశ్చ యిం చుకొన్నాడు .  ఈ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీ లోనేగాక కేరళ  ఇండస్ట్రీ లోకూడా బన్ని తిరుగులేని స్టార్ గా   పేరందుకోబోతున్నాడు