Friday, 25 March 2016

లక్ష్మీ నరసింహస్వామి మహత్యం :

లక్ష్మీ నరసింహస్వామి మహత్యం :
పూర్వ కాలంలో హిరణ్యక శిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు . ఇతను లీలావతి అనే ఆమెను వివాహం చేసుకొనెను . ఇతను తన చుట్టూ ఉన్న రాజ్యాలలో ఉన్న రాజులను ఓడించి రాజ్యములను ఆక్రమించు కొనెను . ఇతను ఒకరోజు తన బార్యతో నేను అడవిలో తపస్సుకు వెళుతున్నాను అని చెప్పి నీవు జాగ్ర త్త అని అడవికి వెళ్ళెను . హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళి ఈశ్వరుని గురించి తపస్సు చేసెను . ఇది ఇలాఉండగా ఇతని బార్య లీలావతి  నెలతప్పి గర్బం ధరించెను . ఈమె పతివ్రతా శిరోమణి . పతి అడవికి వెళ్ళినాడని చింతతో మధనపడుతుండగా నారదమహర్షి ఆమెను చూసి అమ్మా నీవు బాధపడకు నీపతి వచ్చే వరకు నీవు ఆశ్రమంలో బగవంతుని సేవ చేసుకొంటూ ఉండు అని ఆమెను తనతో తీసుకొని వెళ్ళెను . ఆమె ఆశ్రమంలో ప్రతీ రోజూ  బగవంతుని పూజిస్తూ ఉండేది .ఆమె కడుపులో ఉన్న బాలుడు కూడా ఆమె చేస్తున్న పూజలన్నీ ఈ బాలుడుకూడా వింటూ ఉండేవాడు .
ఒక మంచి ముహూర్తాన ఆమె ఒకబాలుడికి జన్మ ఇచ్చింది . నారద మహర్షి ఈ బాలుడికి ప్రహ్లాదుడు అనే నామకరణం చేసెను . ఆమె బర్త హిరణ్యకశిపుని తపస్సు పలించి పరమశివుడు ప్రత్యక్షమయ్యెను . బక్తా నీకు ఏమి
వరం కావలెనో కోరుకోఅనెను . అప్పుడు హిరణ్యకశిపుడు నాకు ఎటువంటి జీవరాసితో కానీ  మానవుడు తోను కానీ మరణం సంబవించ కూడదని వరం కోరుకొనెను . అప్పుడు పరమశివుడు తధాస్తు అని దీవించెను . తర్వాత ఇతను అడవి నుండి తిరిగి రాజ్యమునకు వచ్చెను . రాజ్యంలో తన బార్య లేదని గ్రహించి తన బార్య దగ్గరకు వెళ్ళి తన బార్యను తీసుకొని వచ్చెను . తన పుత్రుని చూసి సంతోషంతో ఉండెను .ప్రహ్లాదుడికి ఐదు సంవత్సరాలు నిండిందికావున  ప్రహ్లాదుడికి విద్య నేర్పించడానికి బోధన అబ్యాసనం చేయడానికి హిరణ్యకశిపుడు తన కుమారుని పిలిచి నాయనా నీవు విద్యా బోధనకు ఆశ్రమానికి వెళ్ళు అని ఆశ్రమానికి పంపెను . హిరణ్యకశిపుడు నేనే  బగవంతున్ని అని రాజ్యంలో అందరిని ఓం హిరణ్యకనమః అని నామ స్మరణ చేయవలెనని ప్రకటన చేసెను .
రాజ్యంలోని ప్రజలందరు కూడా హిరణ్యకశిపుడే దేవుడు అని ఇతనికి బయపడి ఆయననే పూజిస్తూజపం చేస్తూ  ఉండేవారు . ఇది ఇలా ఉండగా ప్రహ్లాదుడు తన గురువు దగ్గర విధ్యాబ్యాసం చేస్తున్నాడు . హిరణ్యకశిపుడు ఇతని గురువుకు కూడా తానే దేవుడు అని తన కుమారునికి కూడా చెప్పాలి అని చెప్పెను . గురువు కూడా ప్రహ్లాదునికి మీ తండ్రియే దేవుడుఅని ఓం హిరణ్యాకాయనమః అని ఉపదేశం చేసెను . కానీ ప్రహ్లాదుడు శ్రీమన్ నారాయణుడే బగవంతుడు అని ఓంనమో నారాయణాయనమః అని ధ్యానం చేసేవాడు . దీన్ని చూసినగురువు మీ నాన్న దగ్గర చెప్పకు మా ప్రాణం పోతుంది  ఆయన లేనప్పుడు బగవంతుని స్మరించుకో అని చెప్పెను .

Tuesday, 22 March 2016

ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు:
తెలుగు క్రొత్త సంవత్సరం ప్రారంబమైనమొదటి  రోజే ఉగాది . ఉగాది పండుగ రోజు మామిడి ఆకులతో పచ్చ తోరణాలు కట్టి వేపాకుల పూతతో తోరణాలను కట్టి అలంకరిస్తారు . అందరు స్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించి బాగా అలంకారం చేసుకొని పచ్చి మామిడి కాయలను తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం వేసి బగవంతునికి ప్రసాదంగా పెట్టి గుడికి వెళ్లి పరమశివునికి ప్రసాదంపెట్టి పూజ చేసేవారు . తర్వాత పచ్చి మామిడి కాయలను తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి బెల్లం ఉప్పు కారం వేపపూత చింత పండు అన్నిటిని కలిపి తినేవారు . ఇలా తినడం ఎందుకంటే మానవుని జీవితంలో సంతోషం బాధ కోపం అన్నిటినీ సమానంగా అనుబవించాలని దేనికీ బయపడ కూడదని ఇలాచేస్తారు .తెలుగు రాష్ట్రాలవారు తెలంగాణ రాయలసీమ వారు మాత్రమేగాక  ఇంకా కర్ణాటక ప్రజలు కూడా ఈ ఉగాది జరుపుకొంటారు . ఈ ఉగాది పండుగ రోజు ఎక్కడెక్కడో ఉద్యోగాలలో ఉన్న వారు కూడా ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సబ్యులతో కలసి పండుగ జరుపుకొనేవారు . ఉగాదికి కలవని వారుజగాదికి కలవరు అన్న సామెత ఉండేది . అందుకే అందరు కలసి ఈ ఉగాది పండుగను జరుపుకొనేవారు . అందరికీ నా హృదయ పూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలుపు తున్నాను .

ముసలి ఎద్దు కథ

గోవు బగవంతునితో సమానం . గోవును ప్రతీ రోజు పూజిస్తే మనకు అన్నీ కష్టాలు తొలగిపోతాయి . మనం నిద్రలేవగానే స్నానం చేసుకొని గోవుచుట్టు మూడు ప్రదిచ్చనలు చేసుకొని నమస్కారం చేసుకోన్నచో మనకు ఉన్న దారిద్ర్యం తొలగిపోతాయి . గోవు ముసలిది అయిపోయింది కదా అని గడ్డి వేయడం దండగ అని వెంకయ్య అనుకొన్నాడు . కానీ గోపన్న సలహా మేరకు గోవును ప్రతీ రోజు నమస్కరిస్తే ధనం వస్తుంది అన్నాడు . వెంకయ్య గోవును ప్రతీ నమస్కరించి దండిగా మేత వేసి పొలంపనులకు వెళ్ళేవాడు . బాగా వర్షాలు పడి పంటలు బాగా పండి మంచి లాబాలు వచ్చాయి . పంటలు బాగా పండడం మాత్రమే కాదు ఇంకా సకల దారిద్ర్యం కూడా తొలగిపోతాయి . కాబట్టి అందరు గో సంరక్షణ చేయండి . అందరు పుణ్యం సంపాదించుకొని సిరి సంపదలతో తులతూగండి . ఇదే విధంగా మానవుడు కూడా ముసలి వాడు అయిపోతాడు కదా ముసలి వాడు అయిపోయాడు ఇక దేనికీ పనికి రాడు అని భోజనం పెట్టకుండా ఇక నీవు వెళ్ళవచ్చు అని చెపుతామా లేదుకదా . మనం చిన్న వయస్సులో మన అమ్మా నాన్న ఏవిధంగా చుసుకోన్నారో మనం కూడా మన అమ్మ నాన్న లను అదేవిధంగా చూసుకోవాలి . 

Saturday, 12 March 2016

ముత్యాల ముగ్గులు

ముత్యాల ముగ్గులు :

ప్రతి స్త్రీ ప్రతీ రోజు ఉదయాన్నే నిద్రలేచి తన ఇంటి ముందు (కలేపు) నీళ్ళు చల్లి ఊడ్చి ముగ్గులు పెట్టాలి . అప్పుడే ఆ ఇంటికి అందం .ఇంటి ముందు ముగ్గులు ఉంటే చాలు చూడడానికి అందంగా ఉంటుంది . ఇలా శుభ్రంగా ఏ ఇల్లు అయితే ఉంటుందో యింట్లో లక్ష్మీ దేవి ఉంటుంది . లక్ష్మీదేవికి కూడా ముగ్గులు అంటే చాలు ఇష్టం . పూర్వ కాలంలో లక్ష్మీ దేవి వేకువజామున వీధిలో నడుచుకొని ఏ ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఒక ఇంటికి వెళ్ళింది . యింట్లో అందరు నిద్ర పోతున్నారు . అది చూసి వెనక్కి వెళ్ళిపోయింది . తర్వాత మరో ఇంటికి వెళ్ళింది .ఆ  యింట్లో ఆ ఇంటి ఇల్లాలు తల విరబోసి పేనులు చూసుకొంటూ తల దువ్వు కొంటూ కనిపించారు .
తర్వాత లక్ష్మీదేవి మరో ఇంటికి వెళ్ళింది . ఆ ఇంట్లో ఇల్లాలు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిముందు నీళ్ళు (కలేపు)చల్లి ముగ్గులు పెట్టి పూజచేస్తూ కనిపించింది . దీన్ని చూసిన లక్ష్మీ దేవి ఆ ఇంట్లోనే కూర్చున్నది. ఆ ఇల్లు ఐశ్వర్యం తో సిరి సంపదలతో తుల తూగుతూ విరాజిల్లింది . అందుకే మనం కూడా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిఇంటి ముందు  ముగ్గులు  పెట్టాలి . మనకు పండగలు వస్తే చాలు మొదట ముగ్గులు పెడతాము  . ముగ్గులు పెట్టగానే పండగ వచ్చినట్టే అనిపిస్తుంది . ముఖ్యంగా సంక్రాంతి పండుగ వస్తే మొదట ముగ్గులు పెడతారు . సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు పండుగ అంటారు కదా .

Thursday, 10 March 2016

గోమాత నమస్తే నమస్తే నమో నమః

గోమాత నమస్తే నమస్తే నమో నమః

గోవులో అన్నీ దేవతలూ నివసిస్తున్నారు . గోవును పూజించడం వలన అన్నీ దేవతలను పూజించే సౌభాగ్యం కల్గుతుంది . పూర్వం శ్రీకృష్ణుడు ఆవులమందలను కాచినాడు గోవులు అంటే శ్రీకృష్ణ పరమాత్మునికి చాలా ఇష్టం .
బ్రహ్మ ఈశ్వరులు కూడా ఆవు దూడగా ఉద్బవించి కలియుగ శ్రీనివాసుని ఆకలి తీర్చారు . గోపూజ చేయడం వలన మన కర్మలు అన్నీ తొలగి పోతాయి . ఆవు మనకు పాలు ఇస్తుంది . పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ గోవు ద్వారానే లభిస్తుంది .గోవు మూత్రం పేడ ఎరువుగా ఉపయోగపడుతుంది . మనకు నిద్ర మత్తుగా సోమరిగా ఉన్నప్పుడు గోమూత్రంతో ముఖం కడుక్కోవడం వలన ఏదో తెలియని ఫ్రెష్ నెస్ లభిస్తుంది .

సూర్యనారాయణా

సూర్యనారాయణా :

ఓం సూర్య నారాయణా
దివాకరా ప్రభాకరా
రవికరా దినకరా భాస్కరా సూర్యనారాయణ
నమస్తే నమస్తే నమో నమః!


మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుడు . సూర్యుడు లేకపోతే మనకు వెలుగు లేదు మొత్తం చీకటే కదా . అందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవలెను . తర్వాత అన్నీ పనులను చేసుకోవడం మంచిది . సూర్యుడు మనకు ఎన్నో విధాలుగాఉపయోగపడుతున్నాడు . సూర్యుడు శ్రీ మన్ నారాయణుని కనులతో సమానం ఆయన కన్నులతోనే మనకు వెలుగు ఇస్తున్నాడు . సూర్యుడు లేదంటే ఈ భూ ప్రపంచమే లేదు . సూర్య కిరణాల వలెనే మనకు ఆక్సిజన్ లభిస్తుంది . సూర్యుని వలెనే ఎండ లభిస్తుంది కదా ఎండ వలెనే పాడి పంటలు పండుతున్నాయి . పంటలు పండటం వలెనే మనకు ఆహారం లభిస్తుంది . ప్రజలు అందరు కూడా ఆహారం కోసమే పనులు చేస్తున్నారు . సూర్యుడు లేదంటే చెట్లు జీవరాశులు ప్రాణులు జంతువులు ఏమి ఉండదు . భగవంతుడు మనకు వెలుగు నిచ్చి ఎల్లవేళలా కాపాడుతున్నాడు . కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారం చేయండి ఆరోగ్యంగా ఉండండి . సూర్య నమస్కారం చేయడం వలన చెడు గ్రహాలవల్ల వచ్చే కష్టాలు నష్టాలూ అన్నీ కూడా తొలగి పోతాయి . సూర్యనారాయణ అనే నామాన్ని ధ్యానం చేయండి . సూర్యగ్రహణం వల్ల వచ్చే కీడు తొలగిపోతాయి . 

Wednesday, 9 March 2016

శివ రాత్రి మహత్యం :


ఓం హర హర మహాదేవ శంభో శంకరా
బ్రహ్మ మురారి సురార్చిత లింగం 
నిర్మల భాషిత శోభిత లింగం 
జన్మజ దుఖ వినాశకలింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !
దేవ ముని ప్రవరార్చిత లింగం 
కామ దహన కరుణాకర లింగం  
రావణ దర్ప వినాశక లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం!
కుంకుమ చందన లేపిత లింగం 
పంకజ వాసిని   శోభిత లింగం 
సంచిత పాప వినాశక లింగం 
 తత్ప్రనమామి సదాశివ లింగం !
దేవగణార్చిత సేవిత లింగం 
బావై భక్తి భిరేవచ లింగం 
దినకరకోటి ప్రభాకర లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !

సర్వ సుగంధ సులేపిత లింగం 
బుద్ది వివర్ధన కారణ లింగం 
సిద్ధి సురాసుర వందిత లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !
అష్టదలోపరి వేష్టిత లింగం 
సర్వ సముద్భవ కారణ లింగం 
అష్ట దరిద్ర వినాశక లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !
సురగురు సురవర పూజిత లింగం 
సురవన పుష్ప సదార్చిత లింగం 
పరమ పరం పరమాత్మక లింగం 
తత్ప్రనమామి సదాశివ లింగం !
అజ్ఞాష్టకం మిదం పుణ్యం పాప వినాశకం . 



ఒక ఊరిలో ఒక కిరాతకుడు ఉండేవాడు . ఇతడు తన భార్య పిల్లలను పోషించడానికి ప్రతి రోజు అడవికి వెళ్లి జంతువులను వేటాడి చంపి తినే వాడు  కుటుంబాన్ని పోషించేవాడు . ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే ఇతని అమ్మ తన కుమారున్ని పిలిచి నాయనా నీవు అడవికి వేటకు వెళ్ళుఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు  అని చెప్పి సొరకాయ బుంగిలో నీళ్ళు పోసి దానికి ఒక దారాన్ని కట్టి దీన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పినది . కిరాతకుడు అలాగే అమ్మా అని సొరకాయ బుంగిని  తీసుకొని అడవికి వెళ్ళాడు . ఇతనికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక జంతువుకూడా  కనిపించలేదు . ఇతను ఉదయం నుంచి పచ్చి నీళ్ళు కూడా త్రాగలేదు . విశేషం ఏమి టంటే ఆ రోజు మహాశివరాత్రి ఇతనికి తెలియకుండా నే ఇతను ఉపవాసం ఉన్నాడు . ఇతను ఈ రోజు రాత్రంతా ఎలాగైనా సరే వన్య మృగాలను వేటాడి తీసుకొన వెళ్ళాలని ఒక మారేడు చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడు . వన్య మృగాలు కోసం వేచి చూస్తున్నాడు . ఇతని సౌభాగ్యం ఏమిటంటే అతడు ఎక్కి కూర్చున్న మారేడు చెట్టు క్రింద శివ లింగం ఉంది . ఇతనికి ఒక లేడి జింక కనిపించింది . ఆలేడి పైన గురి పెట్టి చూస్తూ బాణం వేసాడు  అధిగురి తప్పినది . ఇతను బాణం వేసినప్పుడు ఇతని చెయ్యి తగిలి తన దగ్గరున్న సొరకాయ బుంగి లో ఉన్న నీళ్ళు శివ లింగం పైన పడింది.  తర్వాత బాణం విసిరాడు మరల గురి తప్పినది ఇతని చెయ్యి తగిలి మారేడు ఆకులు శివలింగం పైన పడింది . ఇలా ఇతనికి తెలియకుండానే బగవంతుని కృపకు పాత్రుడయ్యాడు . ఈ కిరాతకుని చెయ్యి తగిలి నీళ్ళు మారేడు ఆకులు శివలింగం పైన పడింది పుణ్యం అంటే ఇదే నేమో రాత్రి నాలుగు జాములు అయిపోయింది . ఒకవిధంగా ఇతనికి తెలియకుండానే ఉపవాసం జాగారణ ముగిసింది . ఈ కిరాతకునికి బ్రహ్మ జ్ఞానం కల్గింది పరమశివుడు ప్రత్యక్ష మయ్యి ఏమి వరం కావాలనో కోరుకో అనెను . పరమశివుణ్ణి చూసిఇతడు సంతోషంతో ఎంత భాగ్యం తండ్రి అని నాతప్పులన్ని చమించు తండ్రీ అని పరమ శివుని పాదాలపైన పడ్డాడు . నీ పాపాలన్నీ తొలగి మరుజన్మలో నీవు గుహుడు అనే చక్రవర్తిగా జన్మిస్తావు అంతే గాక శ్రీరామ చంద్రుడు సేవకు పాత్రుడు అవ్వుతావు అని దీవించాడు .కిరతకుడుగా ఉన్న ఇతడు పరమ శివుని భక్తుడిగా కీర్తి చెందినాడు . దీనితో మనకు తెలిసింది  ఏమిటంటే మహా శివరాత్రి రోజు ఉపవాసం జాగారణ వల్ల మనకు పుణ్యం లభిస్తుంది .