Saturday, 13 February 2016

శ్లోకాలను అందరూ చదవండి


మనకు బాగా చదువు  రావాలంటే ఈ శ్లోకాన్ని మనం మన మనస్సులో బగవంతున్ని స్మరించుకొని జపించాలి . అప్పుడు బాగా చదువు వస్తుంది . పిల్లలకు ఎవరికైనా చదువు రాకుంటే ఈ క్రింది శ్లోకాన్ని చదవమని (పటించమని )చెప్పండి .
చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు
కొలువుతో తీరుతుంది నీకు కరువు
కరువు తీరి వస్తుంది నీ జీవితానికి వెలుగు
ఆ వెలుగును పది మందికి పంచి పెంచుకో నీ పరువు !
చదువు గురుంచి శ్లోకం :
జ్ఞానానందమయం  దేవం
నిర్మల  స్పటికా కృతిం 
ఆధారం  సర్వ  విద్యా నాం 
హయగ్రీవ  ముపాస్మహే !

అప్పు తీర్చే శ్లోకం :
అంగారక మాహి పుత్రా
భగవాన్ భక్తవత్సలా
నమోస్తుతే మమా శేషా
రుణ మాశు విమోచయా !

మనకు త్వరగా అప్పులు తీరాలంటే ఈ శ్లోకాన్ని పటిస్తే అప్పులు తీరిపోతాయి . సహజంగా మన బ్రతుకు తెరువు కోసం అప్పులు చెయ్యక తప్పదు . అప్పులు చేస్తేగానీ బ్రతుకు జరగదు . అప్పులు చేసి బిజినెస్ చేస్తారు . బిజినెస్ లో లాభాలు వచ్చి అప్పులు తీర్చి హాయిగా బ్రతకాలంటే అప్పుతిర్చే శ్లోకం ను పటించండి .

డబ్బు చేరే శ్లోకం :
సిద్ధి బుద్ధి ప్రధాదేవీ
భుక్తి ముక్తి ప్రదాయినీ
మంత్ర మూర్తి సదాదేవీ
మహాలక్ష్మీ  నమోస్తుతే !

ప్రతి మనిషికి డబ్బు చాలా అవసరం డబ్బు లేక పోతే ఒక రోజుగడవడం కష్టమయిపోయింది . డబ్బే లోకమయిపోయింది. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏమి జరగదు . కొంత మంది ఎక్కువగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు . కానీ ఆడబ్బులు నిలవ   లేక పోతుంది . మన ఇంట్లో డబ్బులు నిలవాలంటే ఈ శ్లోకాన్ని పటించండి . మహాలక్ష్మి కరుణిస్తే చాలు మనకష్టాలు తొలగిపోతాయి .


No comments:

Post a Comment