Monday, 8 February 2016

బక్క టైలర్ కథ

బక్క టైలర్ కథ :
అనగనగా ఒక రాజు ఉండేవాడు .  రాజ్యంలోని ప్రజలనురాజు  చాలాబాగా చూసుకొనేవాడు . ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పించేవాడు . ప్రజలను తనబిడ్డలవలె  చూసుకొనేవాడు . ఆరాజ్యంలోని ప్రజలు కూడా రాజును భగవంతుడు వలె పూజించేవారు . ఆ రాజుకు ఒక్క గాన ఒక్క కూతురు ఉండెను . ఆ కూతురును చాలాబాగా గారాబంగా పెంచేవాడు . కానీ రాజ్యంలో ఒక చోట ఒకపెద్ద మర్రిచెట్టు  ఉండేది . ఆ మర్రిచెట్టులో ఒక పెద్ద దయ్యం (రాక్షసుడు )ఉండేది . ఆ రాక్షసుడు ఆ చెట్టు దగ్గరకి వచ్చినవారిని  అందరని బయపెట్టి చంపి తినేస్తూ ఉండేది. ప్రజలందరు బయబ్రాంతులయ్యేవారు .  ఆ చెట్టు దగ్గరకి వెళ్ల వలనంటే బయపడేవారు . ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఉండేది . ఆ గ్రామంలోఒక బక్క టైలర్ ఉండేవాడు . ఆయన  బట్టలు కుట్టుతూ ఉండేవాడు . ఇలా ఉండగా ఒకరోజు ఇతనికి చాలా ఆకలి వేసింది బోజనంకు బదులు ఒకరెండు జాంగ్రీ లను తీసుకొచ్చాడు . ఆ జాంగ్రీ లనుపక్కన పెట్టి తర్వాత తింటాము అనుకొని బట్టలు కుట్టుతూ ఉన్నాడు . ఆ జాంగ్రీ ల పైన ఈగలు వచ్చి వాలాయి . ఆ బక్క టైలర్ దానిని చూశాడు . ఒక్క సారిగా తన చేతులతో ఆ ఈగలను కొట్టాడు . ఒక్క సారి కొట్టగానే ఏడు ఈగలు చనిపోయింది . తనకుతానే ఆశ్చర్యపడ్డాడు అరే మనం ఒక్కసారిగానే ఏడు జీవులను చంపేసాము అని గర్వపడ్డాడు . ఇది ఇలా ఉండగా రాజ్యంలో రాజు ఒక ప్రకటన చేసాడు . ఎవ్వరయితే  తనరాజ్యంలో ఉన్న రాక్షసుణ్ణి చంపుతారో వారికి తన గారాల కూతురుని అతనికి ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు . ఈ ప్రకటనను విన్న జనం అంతా ఆ రాక్షసుణ్ణి చంపి రాకుమారిని వివాహం చేసుకోవచ్చని ఆ రాక్షసుడుని చంపడానికి ఆ చెట్టు దగ్గరకి వెళ్ళేవారు . కానీఆ రాక్షసుడు వచ్చినవారినంధరిని చంపేసేవాడు . ప్రజలందరు బయపడుతూ ఉండేవారు . ఇది ఇలా ఉండగా బక్కటైలర్ ఏడు జీవులను చంపానని ఒక పేపర్ లో రాసుకొని తన మేడలోవేసుకొని అందరికి చూపిస్తూ ఉండే వాడు  . దీ నిని చూసిన రాజుగారి భ టు లు ఆ బక్క టైలర్ ను తీసుకొని రాజుగారికి అప్పగించారు .
ఆ రాజు అతణ్ణి చూసి ఇతన్ని చూస్తే ఇంత బక్క చిక్కిఉన్నాడు  ఇతను రాక్షసుడుని చంపగలడా అని నిరాశ కల్గింది . \కానీ ఈ బక్కటైలర్ నేను చంపగలను అని వాదించాడు . తర్వాత ఆ చెట్టుధగ్గరకి వెళ్ళాడు .

బక్కటైలర్  రెండవ   భాగం :

No comments:

Post a Comment